ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం
తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది. తేనెలొలుకు భాష మన తెలుగు భాష.అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి, గ్రాంథిక భాషలో ఉండే పాఠ్యాంశాలు వాడుక భాషలోనే ఉండాలని గిడుగు రామ్మూర్తి పంతులుగారు ఉద్యమం చేశారు. ఈయన చేసిన కృషిని గుర్తించి ఈయన పుట్టిన రోజు అనగా ఆగస్టు 29న “తెలుగు భాషాదినోత్సవం”గా జరుపుకుంటారు.